ప్రజా ఉద్యమం ద్వారా జిల్లాను సాధిస్తాం – కందుల, జెఎసి కన్వీనర్ సైదా, ఇమ్మడి

ప్రజా ఉద్యమం ద్వారా అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా సాధిస్తామని జిల్లా సాధన సమితి (జెఎసి) నాయకులు కందుల నారాయణరెడ్డి,జఏసి కన్వీనర్ షేక్ సైదా, ఇమ్మడి కాశీనాధ్’లు అన్నారు. స్థానిక సెవెన్ హిల్స్ హోటల్ దగ్గర నుండి సి.పి.ఐ కార్యాలయం వరకు శనివారం సాయంత్రం మార్కాపురం జిల్లా సాధన సమితి (జెఎసి) ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కలిసి రాని పక్షంలో ప్రజా ఉద్యమ ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ప్రజలలో చైతన్యం పెరిగిందని ఉద్యమబాట పట్టారని కచ్చితంగా జిల్లాను సాధించి తీరుతామని శపథం పూనారు. జెఎసి నాయకులు అందె నాసరయ్య, శాసనాల వీరబ్రహ్మం, వేశపోగు సుదర్శన్, షేక్ అబ్దుల్ రజాక్’లు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధన కోసం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఆశయాలపై ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో మిమ్ములను కదలనీయకుండా మీ ఇళ్లముందు కూడా ఉద్యమం చేయడానికి వెనుకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, తాళ్లపల్లి సత్యన్నారాయణ, వక్కలగడ్డ మల్లిఖార్జునరావు, తిరుమలశెట్టి వీరయ్య, యన్.వి. సురేష్ కుమార్, షేక్ ఖాసిం, గఫార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.