గిద్దలూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు గ్రామాల పర్యటన

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు రాచర్ల మండలంలో పుళ్ళలచేరువు, చిన్నగానిపల్లి చోల్లవీడు, అకవీడు, అరవీటికోట, అనంపలల్లి, అనుమలవీడు, రాచర్ల, సోమిదేవిపల్లి, సంగపేట గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేయడం జరిగినది. గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలని కలసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువులు చాలా పెరిగాయని ప్రజలు చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ప్రజలు ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబుకు చెప్పటం జరిగింది. రాచర్ల మండల కమిటీ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు లంకా నరసింహరావు, కాల్వ బాల రంగయ్య, రాచర్ల మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, సిద్దం వెంకటేశ్వర్లు, లంకా జనార్ధన్, ఏలం పుల్లారావు, కుప్ప రంగస్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.