నారపరెడ్డి పార్థసారథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

మామిడికుదురు సెంటర్లో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జాలె౦ శ్రీనివాసరాజా మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన నారపరెడ్డి పార్థసారధి మృతి జనసేన పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మండల జనసేన పార్టీ తరపున మండలాధ్యక్షుడు జాలె౦ శ్రీనివాస్ రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచ్ స్మాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, ఎంపీటీసీ కొమ్మలు జంగమయ్య, చెరుకూరి సత్తిబాబు, కంకిపాటి నరసింహారావు, బొంతు చంద్రశేఖర్, అడబాల చిన్ని, నంబూరి అచ్చిబాబు, తుల ఉమ, రవణం సాయి, కొమ్ముల రాము తదితరులు పాల్గొన్నారు.