వై కేటిగిరీ భద్రత కల్పించాలి: పాయల్ ఘోష్

బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలసి.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తనకు వై కేటిగిరీ భద్రతను కల్పించాలని కోరారు. ఈ మేరకు పాయల్ ఘోష్ గవర్నర్ కు ఓ లేఖ అందజేశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ..గౌరవనీయులైన మహారాష్ట్ర గవర్నర్ కొష్యారీతో సమావేశం గొప్పగా జరిగింది. ఆయన నాకు మద్దతు తెలిపారు. విమర్శించేవారు, అభ్యంతరం తెలిపేవాళ్లు, వ్యతిరేకించే వాళ్లున్నారు. కానీ నేను అస్సలు ఆగను. ముందుకెళ్తానని ట్వీట్‌చేశారు పాయల్‌.