మడకశిర మండల జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం
మడకశిర మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమిదాలగొంది ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జన సైనికులకు నాయకులకు పలు సమస్యల పట్ల దిశానిర్దేశం చేసి పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నా జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. భవిష్యత్ కార్యాచరణ మరియు ఎలా ముందుకు వెళ్లాలి అని ఈ సమావేశంలో మండల అధ్యక్షులు శివాజీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు జనసేన నాయకులు మడకశిర మండల అధ్యక్షుడు టి.ఏ.శివాజీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి, రఘు సంయుక్త కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-29-at-8.00.59-PM.jpeg)