గుంతకల్లు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జనసేన నాయకులు

గుంతకల్లు, జనసేన పార్టీ అధ్వర్యంలో శుక్రవారం గుంతకల్లు టౌన్ ఎస్.జే.పి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి స్థానికంగా ఉండే సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకొని సమస్యల గురించి పాఠశాల యజమన్యంతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, జిల్లా కర్యనిర్వహన కమిటి సభ్యుడు అమీర్ సొహేల్, హెన్రీ పాల్, విజయ్ కుమార్, మారుతి, బోయ విరేష్, ఆర్ సీ సురేష్, మహేష్, మణికంఠ, అరవింద్, సాయి తేజ, భరత్, తదితరులు పాల్గొన్నారు.