జనసేన జన జాగృతి యాత్ర

  • గ్రామ గ్రామానా తేనిటీ విందు కార్యక్రమం 7వ రోజు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొత్తతుంగపాడు గ్రామంలో 7వ రోజు జన జాగృతి యాత్ర రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి కీలక పాత్ర వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ సమక్షంలో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర ఆధ్వర్యంలో సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, తెలగారెడ్డి దుర్గా ప్రసాద్, ఆర్ చక్రవర్తి, చల్లా వెంకన్న, కె మణికంఠ నాగావరుపు భానుశంకర్, బొబ్బరడా వాసు, సీనియర్ నాయకులు అడబాల సత్యనారాయణ, అడబాల హరి, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుతో తేనీటిని ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.