పలుకుటుంబాలను పరామర్శించిన గంటా స్వరూప

రాజనగరం నియోజకవర్గం, సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామ జనసైనికులు మరియు గ్రామస్థుల ఆహ్వానం మేరకు లక్ష్మిగణపతి ఆలయం సందర్శించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, అనంతరం జనసైనికుడు దార్ల బ్రమ్మం తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని పార్టీ తరుపున అన్ని విధాలా సహాయం చేస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం, ఈ నెల సెప్టెంబర్1స్ట్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జరిగిన వైసీపీ, జనసేన గొడవలో గాయపడ్డ జనసైనికుడు పెంటపాటి నారాయణ కుటుంబాని కూడా పరామర్శించారు కుటుంబానికి ధైర్యం చెప్పి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్ శంకర్, వీరమహిళ అరుణ, మండల వైస్ కన్వీనర్, కతా సత్యనారాయణ, ఇనుగంటివారిపేట జనసైనికులు కొందాటి సత్యనారాయణ, సత్య కొందాటి, హరీష్ కొందాటి, కుంచె సురేష్ వరదా వంశీ, చిక్కాల సన్నీ, షేక్ బాషా, దార్ల బ్రహ్మం, దార్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.