విజయదశమి పర్వదినాన జనసేనలో చేరికలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయదశమి పర్వదినం రోజు పలువురు జనసేన పార్టీలో తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. న్యాయవాది శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యులు తొత్తడి భరత్ తో పెద్ద ఎత్తున యువత మరియు 51వ డివిజన్ జనసేన అధ్యక్షులు బత్తుల వెంకటేష్ ఆధ్వర్యంలో యువత విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి పోతిన మహేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు, బత్తుల వెంకటేష్, పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, వేంపల్లి గౌరీ శంకర్, రెడ్డిపల్లి గంగాధర్, సింగనంశెట్టి రాము, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్ ప్రధాన కార్యదర్శి మోబినా అమ్మవారి ధార్మిక సేవా మండల సభ్యులు తమ్మిన రఘు మరియు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.