ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. తాను సురక్షితమేనంటూ ట్వీట్.!

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు ప్రమాదం తప్పింది. చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. కారు ఎడమ వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. నుజ్జునుజ్జయింది. సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ కావడంతో వేరే వాహనంలో ఆమె గమ్యస్థానానికి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక కారు ప్రమాద ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటడ్డానని ఖుష్బూ ట్వీట్ చేశారు.