అగ్నిప్రమాద బాదితురాలికి అండగా నిలిచిన జనసేన

రాజమండ్రి సిటీ: స్థానిక సింహాచలనగర్ లో శుక్రవారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైనది. ఈ విషయం తెలిసిన స్థానిక జనసైనికులు రాంబాబు మరియు ఖాన్ ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే అనుశ్రీ స్పందించి పరామర్శకు వెళ్లి 5000 నగదు బాధితురాలు అయినటువంటి కుమారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాధితురాలికి నగర సంయుక్త కార్యదర్శి కేల జయలక్ష్మి అను శ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గేడం నాగరాజు, రాజమండ్రి కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి అల్లాటి రాజు, రాజమండ్రి కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ దేవకివాడ చక్రపాణి, జన సైనికులు పరామర్శించారు