రైతులకు మద్దతుగా పద్మవిభూషణ్ వాపస్

కేంద్ర ప్రభుత్వం  అమలులోకి తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్ర మాజీ సీఎం, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కేంద్రం తీరు పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఆయన తన వద్ద ఉన్న పద్మ విభూషణ్ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని, దానికి నిరసనగా పద్మవిభూషణ్ అవార్డును వాపస్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.