శాంతినగర్ ఘటనపై జనసేన నాయకుల మెమోరాండం

కూకట్ పల్లి: తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాలతో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ మరియు షేక్ ముంతాజ్, కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ ను కలిసి ఇటీవల కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న శాంతినగర్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ కూలి ఇద్దరు చనిపోయిన సంఘటన పై మెమోరాండం ఇవ్వటం జరిగినది. ఈ సందర్భముగా తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి నుంచి కొత్తగా బిల్డింగులు కట్టుటకు జి ప్లస్ టు పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు, ఆరు ఫ్లోర్లు కడుతూ నియమ నిబంధనలను పాటించకుండా నాణ్యత లోపంతో కన్స్ట్రక్షన్ చేస్తూ కూలీల ప్రాణాలను బలికొంటున్నారని, అధికారులు ఇలాంటి బిల్డింగులను పర్యవేక్షించి పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.