వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయిపల్లవి
ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న ప్రేక్షకులు డిజిటల్ రంగానికి ప్రాదాన్యత ఇస్తుండగా… స్టార్స్ అందరూ డిజిటల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్స్ డిజిటల్ బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి బాటలో సాయిపల్లవి కూడా చేరారు. మణిరత్నం, నెట్ఫ్లిక్స్ సంస్థలు కలిసి ‘నవరస’ అనే వెబ్ సిరీస్ను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్స్ను తెరకెక్కించనుoడగా. అందులో ఓ ఎపిసోడ్ పరువు హత్యలపై చిత్రీకరించనున్నారు. ‘అసురన్’ ఫేమ్ వెట్రిమారన్ తెరకెక్కించనున్న ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సాయిపల్లవి తండ్రీ కూతుళ్లుగా నటిస్తున్నారట.