గుడిసేటి అమర్నాథ్ వల్ల ఈ రాష్ట్రానికి, వారి కుటుంబానికి ఏమీ ఉపయోగం..

  • నోరు అదుపులో పెట్టుకో లేకుంటే, కాపులే నిన్ను జగదాంబ సెంటర్ లో గుడ్డలుడతీసి మరీ కొడతారు..
  • అమర్నాథ్ ఇక అమర్నాథ్ యాత్రే..
  • నిప్పులు చెరిగిన జనసేన పార్టీ కిరణ్ రాయల్..

తిరుపతి: తమ జనసేనాని పవన్ కళ్యాణ్ పై గుడివాడ (గుడిసేటి) అమర్నాథరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జనసేన పార్టీ నేతలు తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, అడ్వకేట్ ముక్కు సత్యవంతులు సుమన్ బాబు స్పందించారు.. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. కాపుల ఓట్లతో గెలిచిన అమర్నాథ్ ను ఈసారి కాపుల ఇళ్లలోని కుక్కలు కూడా అను మతించవని హెచ్చరించారు.. కాపు జాతికి న్యాయం చేసే దిశగా ప్రజల శ్రేయస్సును కోరి తమ పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే ఈ ఐటీ శాఖ మంత్రిగా ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాకపోగా వైజాగ్ లో 600 ఎకరాలను భూకబ్జా చేసిన ఘనత అమర్నాథ్ దే అని అన్నారు.. ఇలాంటి పనికిమాలిన మంత్రిని వైజాగ్ జగదాంబ సెంటర్లో జనం చేతే గుడ్డలూడదీసి కూర్చోబెట్టడం ఖాయమన్నారు, తమ జనసేన పార్టీ జనంలో నుంచి పుట్టిందని , కానీ వైకాపా దొంగలు, డెకాఈట్స్, పోరంబోకులు, కబ్జాదారులతో అవినీతిపరులతో కలిసి దోచుకోవడానికి వైసిపి వెలసిందని దుయ్య బట్టారు.. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మనోజ్, గల్లా ఆదికేశవులు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.