జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు బేతల్ విలాంగణి స్కూల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే ఆదేశాల మేరకు పాఠశాల నందు ఆర్థిక ఇబ్బందులతో విద్య సాగిస్తున్న సంధ్య, స్రవంతి, విద్యార్థినిలకు చేయూతగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇద్దరు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల కొరకు పరీక్షా సామాగ్రిని అందజేశారు తదనంతరం వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో పేద విద్యార్థులకు జనసేన పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్, ఆదిశేషయ్య, కుమార్ షాకీర్, భీమ, స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.