గాయాలపాలైన జనసైనికులను పరామర్శించిన జనసేన నాయకులు

మచిలీపట్నం, జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మచిలీపట్నం నియోజకవర్గంలో గాయాలపాలైన జనసైనికులను పరామర్శించి వైద్యసాయం అందచేసిన మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ మరియు కొరియర్ శ్రీను. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గడ్డం రాజు, తోట రాజేష్, సాయిన శివ, బొప్పిడి చంటి, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.