కరోనా కోసం భయాందోళన వద్దు – అప్రమత్తంగా ఉండండి: డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం, కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ కరోనా వైరస్ సోకినవారు భయపడవద్దని, ఎవరికైనా వైరస్ సోకితే తనను సంప్రదిస్తే వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన తెలియజేశారు. అందుకు గాను సంప్రదించాల్సిన నంబర్ 98859 74777.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-10-at-15.37.48-1024x576.jpeg)