డా.బి.ఆర్ అంబేద్కర్ కు ఘననివాళి

డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జనసేన పార్టీ దత్తి రాజేరు మండల నాయకులు ఆధ్వర్యంలో కె. కృష్ణాపురం, పెద మనపురంలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చప్ప అప్పారావు మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చప్ప అప్పారావు, పార్టీ ప్రచారల కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్, పల్లె సత్యన్నారాయణ, సూర్య బొబ్బాది, మండల నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.