ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం..

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రెహమాన్ తల్లి కరీమా బేగం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం కరీమా బేగం కన్నుమూశారు. దీంతో రెహమాన్ కుటుంబంలో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కరీమా బేగం భర్త ఆర్‏కే శేఖర్ రెహమాన్ తొమిదేళ్ళ వయసులోనే మరణించారు. కరీమా బేగం, శేఖర్ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెహమాన్ చిన్నవాడు. తన తల్లి అంటే రెహమాన్‌కు చాలా ఇష్టం. ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆయన ఇష్టపడేవాడు. పలు ఇంటర్వ్యూలలో సైతం తన తల్లి పట్ల ఉండే ఇష్టాన్ని రెహమాన్ తెలిపాడు. తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం తన తల్లినే కారణం అని రెహమాన్ ఓ సందర్భంలో చెప్పాడు. విషయం తెలిసిన అభిమానులు, ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పలువురు ప్రముఖులు రెహమాన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు.