నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బొంతు రాజేశ్వరరావు
రాజోలు: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అన్నారు. రాజోలు మండలం చింతలపల్లి, కూనవరం గ్రామంలో తడిచిన వరి పనలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు, దొమ్మేటి సత్యనారాయణ, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-26-at-8.00.14-PM-1024x524.jpeg)