హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి: ఎయిమ్ కమిటీ

విజయనగరం: ప్రపంచం మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా ఎయిమ్ కమిటీ తరుపున గుర్ల పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎయిమ్ కన్వీనర్ కెల్ల భీమారావు, గుర్ల మండలం ఎయిమ్ కన్వీనర్ తలే నారాయణ అప్పడు, వెలుగు సీసీ మరియు పొలాయవలస గ్రామం ఎయిమ్ కన్వీనర్ శంఖబత్తుల ఆదినారాయణ, పల్లిగండ్రేడు గ్రామం సర్పంచ్ పెనుమాల సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.