పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు పితాని బాలకృష్ణ, కాట్రేనికోన మండలం, కాట్రేనికోన గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నాగిడి నాగేశ్వరరావుని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం కాట్రేనికోన మండలం పెనుమల్ల గ్రామంలో యాక్సిడెంటులో మరణించిన జనసేన పార్టీ యువ నాయకులు ఈలి మణికంఠ కుటుంబ సభ్యులను మరియు కాట్రేనికోన గ్రామంలో ఆజాద్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పిల్లి గోపి, సంసాని పాండురంగారావు, మట్టపర్తి శంకర్, భీమాల సూరి నాయుడు, గిడ్డి రత్నశ్రీ, ఓగూరి భాగ్యశ్రీ, నూతన బాబు మరియు గుత్తుల బాజీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.