కనకదుర్గమ్మ అమ్మ వారి జాతర మహోత్సవంలో అన్నదమ్ములకి ఘన స్వాగతం

రాజానగరం: అమ్మ వారిని దర్శించుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అమ్మ వారికి 5,000₹ రూపాయలు విరాళం ఆలయ కమిటీ వారికీ జనసేన పార్టీ తరుపున ఇవ్వడం జరిగింది. ఆలయ కమిటీ వారు అన్నదమ్ములు ఇద్దరికీ కలిపి సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, జనసేన పార్టీ కార్యకర్తలు, మధురపూడి గ్రామస్తులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.