సిసి రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన అడబాల తాతకాపు

మామిడికుదురు మండలం, లూటుకుర్రులో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మరియు లూటుకుర్రు సర్పంచ్ అడబాల తాత కపు తెలిపారు. ఈ మేరకు గ్రామంలో 2, 6 వార్డుల నడుమ నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మండల పరిషత్, పంచాయతీ నిధులు రూ.4 లక్షలతో ఈ సిసి రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, పంచాయతీ వార్డు సభ్యులు బోనం కొండ, రొక్కం తేజేశ్వరరావు పాల్గొన్నారు.