ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 3వ రోజు జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం: “జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్” 3వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరిస్తూ, ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాన్ని, దోపిడీ లను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు, త్రాగు నీరు, డ్రైనేజ్ కాలువల సమస్యను ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, వీర మహిళలు దేవి, బతెమ్మ, శారద, సకుంతలమ్మ, రేవతి, జయంతి, రాజలక్ష్మి, నాయకులు దినేష్, గురవయ్య, రాజేష్, గిరీష్, శ్రీరామ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.