ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సమితి వైస్ చైర్మన్లు నియామకం

  • పార్వతీపురం మండల వైస్ చైర్మన్ గా అన్నాబత్తుల దుర్గాప్రసాద్
  • పార్వతీపురం పట్టణ వైస్ ప్రెసిడెంట్ గా కొల్లి వెంకటరావు

ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మండల, పట్టణ వైస్ చైర్మన్ లను నియమించినట్లు ఆ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు వంగల దాలి నాయుడు తెలిపారు. పార్వతీపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్, ఆదేశాల మేరకు సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకర్రావు సమక్షంలో ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. పార్వతీపురం మండల వైస్ చైర్మన్ గా అన్నాబత్తుల దుర్గాప్రసాద్, పార్వతీపురం పట్టణ వైస్ చైర్మన్ గా కొల్లి వెంకట్రావులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇకపై వీరు పర్యావరణ పరిరక్షణ, చెరువులు, గెడ్డలు నీటి వనరులు సంరక్షణ తదితర వాటిపై సమితి ఆదేశాల మేరకు, నియమ నిబంధనల మేరకు పనిచేస్తారన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సమితి కండువా వేసి నియామక ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొత్తగా వైస్ చైర్మన్లుగా ఎన్నికైన అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కొల్లి వెంకటరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడులు చేస్తున్న ఈ క్రతువులో తమకు భాగస్వామ్యం దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు.