గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లో రామమందిర శకటం ప్రజలను ఆకట్టుకోనుంది. యూపీ సర్కార్ పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్‌తో వచ్చే సంవత్సరం గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు. గణతంత్ర పరేడ్‌లో యూపీ సర్కార్ రామమందిర శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా డిజైన్ చేస్తున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.