పలు కుటుంబాలను పరామర్శించిన బండారు

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామం నందు, మరియు పెద్దపల్ల గ్రామం నందు ఆదివారం కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆలమూరు మండలం పెద్దపల్ల గ్రామానికి చెందిన నామాల అనసూయ ఇటీవల కాలంలో స్వర్గస్తులైన కారణంగా, నామాల రుద్రయ్య చౌదరిని, వీరి కుటుంబ సభ్యులను బండారు శ్రీనివాస్ పరామర్శించారు. వీరిని పరామర్శించి, వారితో ఎంతో ఆత్మీయతతో వారి కష్టాలను పంచుకుంటూ, వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. అనంతరం ఆలమూరు గ్రామం దేవి కాలనీలోని ఇటీవల స్వర్గస్తులైన ఎలుగుబంట్ల రాధమ్మ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులు వారితో కొద్దిసేపు ఎంతో ఆత్మీయతతో కలిసిమెలిసి ధైర్యం చెప్తూ, వారి కుటుంబ సభ్యులకు కుటుంబ పెద్దలు లేని లోటు చాలా బాధాకరమని, ఆందోళన చెందవద్దని, కొత్తపేట నియోజకవర్గ జనసేన నేత బండారు శ్రీనివాస్ తెలియజేశారు. వీరి వెంట గ్రామ, మండల జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.