నూతన వధూవరులను ఆశీర్వదించిన బండారు శ్రీనివాస్

కొత్తపేట: డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్ జేఅర్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఘనంగా జరిగిన ఈతకోట గ్రేడ్ -1 పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అన్వర్, సాయి రామ దంపతుల రిప్సెప్షన్ వేడుకకు కొత్తపేట నియోజక వర్గం జనసెన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం అనేది మనిషి చేయగలిగే ఆవిష్కరణ యొక్క అతి ముఖ్యమైన మరియు జీవితకాలం కొనసాగే సుదీర్ఘ ప్రయాణం అని అన్నారు. అనంతరం వధూ వరులను ఉద్దేశించి మీరిద్దరూ ఇప్పుడే జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించారని, మీరు జీవితంలోని అన్ని ఆనందాలను రుచి చూసి, నూతనంగా ఒక్కటై, ఇటు మీ ఇంటివారికి, అటు అత్త ఇంటివారికి ప్రేమానురాగాలు పంచుతూ, సమాజానికి, భావితరాలకు, బంధుమిత్రులకు, ఆదర్శ జంట గా నిలుస్తూ, చక్కని పిల్లా పాపలు కలిగి, ఆయురారోగ్యాతో నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని మనసార ఆశీర్వదిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల డేవిడ్, కట్ట రాజు, చల్లా వెంకటేశ్వరరావు, చల్లా బాబి, సిరిగినేడి పట్టాభి, పడమట గణేష్, దాసి మోహన్, కోట వరలక్ష్మి, కొండేటి హేమ దేవి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.