చలివేంద్రం ఏర్పాటు చేసిన వికలాంగుడిని అభినందించిన బత్తుల

రాజానగరం మండలం, సూర్యారావుపేట గ్రామంలో ఒక వికలాంగుడు ప్రజలు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేసిన సేవలను గుర్తించి రాజానగరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి సత్కరించడం జరిగింది.