పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

  • పాముకాటుకు గురైన వ్యక్తిని పరామర్శించిన బత్తుల

రాజానగరం, ఇటీవల పాముకాటుకు గురై కోలుకుంటున్న రాజానగరం మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన వాకల జాను ప్రసాద్ ని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి వారి ఇంటివద్ద పరామర్శించి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం జనసైనికులు పాల్గొన్నారు.

  • సూరిశెట్టి చక్రధరరావుని పరామర్శించిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం, ములకలంక గ్రామానికి చెందిన క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన పార్టీకి చెందిన సూరిశెట్టి ఆనంద్ తండ్రి చక్రధరరావుని జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా వెంకటేశ్వరరావు, కొండాటి సత్యనారాయణ, రొంగలి అభిరామ్ నాయుడు, రుద్రం నాగు, పిండి వివేక్, అడబాల బాబి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

  • జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన జనసెన పార్టీ నాయకులు ఆకుల ఊదారావు చనిపోయారని తెల్సుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, కుటుంబ అవసరాల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా వెంకటేశ్వరరావు, కొండాటి సత్యనారాయణ, రొంగలి అభిరామ్ నాయుడు, రుద్రం నాగు, పిండి వివేక్, కవల సురేష్, రుద్రం గణేష్, మనేపల్లి నాగేంద్ర, వెంప గణేష్, మానేపల్లి దొర, నల్ల ప్రవీణ్, ఈలి నాగేంద్ర, దూళ్ళ దుర్గ, ఆకుల తనిల్ కుమార్, బండి సాయి గణేష్, షేక్ అషు మరియు గ్రామ జనసైనుకులు పాల్గొన్నారు.