కొట్టే వారాహి ప్రచార రథాలు ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి టిడిపి – జనసేన ఉమ్మడి ప్రభుత్వ సాధనే లక్ష్యంగా కొట్టే ఉదయ భాస్కర్ సౌజన్యంతో కొట్టే సాయి ఆధ్వర్యంలో రాష్త్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోన్న కొట్టే వారాహి వాహనాలను తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కొట్టే వారాహి వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని కొబ్బరికాయ కొట్టిన పూజలు నిర్వహించిన బొజ్జల రిషిత రెడ్డి. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి – జనసేన కలయికతో ఈ అవినీతి వైసిపి పాలన అంతం కాబోతోందని, శ్రీకాళహస్తిలో కనీవినీ ఎరుగని మెజారిటీతో వైసిపి ని భూస్థాపితం చేయబోతున్నామని పేర్కొన్నారు. అనంతరం కొట్టే సాయి మాట్లాడుతూ జనసేన – టిడిపి ప్రభుత్వ స్థాపనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఓట్లు గల కొట్టే వారందరూ కలిసికట్టుగా పని చేసి ఈ వైసిపి ప్రభుత్వాన్ని కూలదోయాలని కోరారు. కొట్టే వారి ఆహ్వానం మేరకు కొట్టే వారాహి వాహనాలను జెండా ఊపి ప్రారంభించడానికి బొజ్జల సుధీర్ రెడ్డి రావడం చాలా సంతోషం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.