టీమిండియాకు శుభాభినందనలు.. ప్రధాని మోదీ

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్వితీయమైన రీతిలో టెస్టు సిరీస్ ను చేజిక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు జైత్రయాత్రను అందరం బాగా ఆస్వాదించామని తెలిపారు. ఈ పర్యటన ఆసాంతం భారత ఆటగాళ్ల తపన, తరగని ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించాయని వెల్లడించారు. ఉక్కులాంటి సంకల్పం, సడలని దీక్ష కూడా ప్రస్ఫుటమయ్యాయని మోదీ వివరించారు. ఈ సందర్భంగా టీమిండియాకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్ లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.