పేదలకు అందచేసిన ఇళ్ల స్థలాల్లో అవినీతి చోటుచేసుకుంది: తుమ్మల బాబు

  • జగనన్న కాలనీలలో పెద్దాపురం జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందచేసిన ఇళ్ల స్థలాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సామర్లకోటలో గల జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వ ఉండి పోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సామర్లకోట పట్టణానికి సంబంధించి లబ్ధిదారులకు వేట్లపాలెం గ్రామంలో మారుమూల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. నియోజకవర్గంలో 8 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నా అందులో 50 శాతం పైబడి ఇళ్ల నిర్మాణం ఇంకా చేపట్టలేదని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముందుగా రోడ్లు, డ్రైన్ లు ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన ఉందని కంగారుగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సరోజ వాసు, పిట్టా జానకి రామారావు, మంచెం సాయిబాబు, అత్తిలి కృష్ణ, పెంకే వెంకటలక్ష్మీ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.