యువతా మేలుకో కార్యక్రమంతో దద్దరిల్లిన దగదర్తి

  • భారీగా హాజరైన దగదర్తి మండల యువత

దగదర్తి: యువతా మేలుకో కార్యక్రమంలో సిద్దు మాట్లాడుతూ ప్రతి యువకుడు తన హక్కుల కోసం ప్రశ్నించు, పోరాడు, సాధించే అనే నినాదంతో అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పోరాటం చేద్దామని తెలిపారు.

కబడుగు బలహీన వర్గాల యువతని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా తమ వెంట తిప్పుకుంటున్నారు తప్పా వాళ్లకి ఉపాధి కానీ నాయకులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదని తెలిపారు,ఈ మూడు సంవత్సరాలలో కావలి నియోజకవర్గంలో ఒక్క యువకుడికైనా ఉపాధి చూపించారా,ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేస్తాం అని చెప్పి యువకుల్ని పచ్చి మోసం చేసారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, మనోజ్, చంటి, పవన్ కరీమ్, చిన్నా, కేశవులు, రాబోర్ట్, వంశీ, గణేష్, బాలాజీ, ఆదర్స్, ప్రసాద్, మనోహర్, కార్తిక్, భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.