థియేటర్‌లో పేపర్స్ విసురుతూ రచ్చ చేస్తున్న దిల్ రాజు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ మానియా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు వకీల్ సాబ్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రోజు సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి వకీల్ సాబ్ సినిమా చూస్తానంటూ ట్వీట్ చేశారంటే మూడేళ్ల తర్వాత పవన్ నటించిన సినిమాపై అందరిలో ఎంతో ఉత్సుకత ఉందో అర్దమవుతుంది.

ఈ రోజు ఉదయం శివ పార్వతి థియేటర్‌లో వకీల్ సాబ్ బెనిఫిట్ షో ప్రదర్శించగా, ఈ షోకు దిల్ రాజు తన సతీమణితో హాజరయ్యారు. అయితే వెండితెరపై తాను పవన్ చూసిన ఆ క్షణం తాను నిర్మాతను అని మరిచిపోయి డై హార్డ్ ఫ్యాన్‌లా పేపర్స్ పైకి విసిరేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన విషయం విదితమే.