జనసేన నాయకుల ఆద్వర్యంలో విద్యార్థులకు టాబ్ ల పంపిణీ
కందరడా గ్రామంలో జడ్పీటీసీ హై స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాబ్ లను హెడ్ మాస్టర్ సమక్షంలో హైస్కూల్ చైర్మన్ పందుల శ్రీను, కందరడా గ్రామ జనసేన ఎంపీటీసీ పిల్లా సునీతా, సూర్యనారాయణ, కందరడా సర్పంచ్ సైతన భరతి వరప్రసాద్, ఎంపీపీ కనబత్తుల కామేశ్వరరావు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ పిల్లా సునీత, సూర్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు చక్కగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయిలోకి ఉద్యోగలు అందుకోవాలని కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-29-at-8.51.28-PM-1024x769.jpeg)