ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేయండి

  • విలేకరుల సమావేశంలో యశస్వి మరియు అతిధి

విజయనగరం అశోక్ బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు సాయంత్రం కలెక్టరేట్ జంక్షన్ లో నిర్వహించు “ప్రజాగళం” బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈనెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు విజయనగరం కలెక్టరేట్ జంక్షన్ లో “ప్రజాగళం” భారీ బహిరంగ సభ జరుగుతుంది అని పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు విజయనగరం నియోజకవర్గం లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.
‌మరియు బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అశోక్ బంగ్లాలో మన అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు అనంతరం బయలుదేరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయడానికి విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారని, ఈ నామినేషన్ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేసారు. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.