జమాదులపాలెంలో జనసేన, టీడీపీ, బీజేపీల డోర్ టు డోర్ ప్రచారం

అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలంలో జమాదులపాలెం గ్రామంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు కలిసి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అనకాపల్లి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్దిగా కొణతాల రామకృష్ణని గాజుగ్లాస్ గుర్తుపై మరియు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, నిండుమనసుతో ఈసారి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి, రాష్ట్రంలో అరాచకాలకు కేరాప్ అడ్డాగా మారిన వైసీపీని బూస్థాపితం చేయడంలో గ్రామ ప్రజానీకం సహకరించాలని కోరారు. జనసేన, బీజేపీ సింబల్స్ జనాల్లో విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఈ ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరక బాబురావు, మాజీ ఎంపీటీసీ కరక రాజు, టీడీపీ మండల నాయకులు ఒమ్మి కొండబాబు, జనసేన నాయకులు బొట్టా రాజారావు, వీరమహిళ శనివాడ లక్ష్మి, గ్రామ అధ్యక్షులు కరణం శివ కుమార్, జనసేన మండల కార్యదర్శి గూడెపు మణికంఠ, కరక వెంకట రమణ, గూడుపు చిన్నారావు, బీజేపీ నాయకులు ఒమ్మి లోవరాజు, కరణం శివ గణేష్ మరియు గూడుపు గోవింద, ప్రసాదుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.