కాకడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ గ్రామం నందు కాకడ అప్పారావు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, మత్స్కర నాయకులు పల్లేటి బాపన్న దొర, సోదే బాబి, కొత్తపల్లి రాజు, పలివెల్ల నాని బాబు, వీరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-6.08.02-PM-1024x457.jpeg)