రుద్రవరం జనసేనలో చేరికలు

ఆళ్ళగడ్డ నియోజకవర్గం, రుద్రవరం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి తెలుగు పేట కాలనీకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన 100 కుటుంబాలు ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరేంద్ర యాదవ్, నయమత్ ఖాన్, కుమ్మరి నాగేంద్ర, గుర్రప్ప, వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, ప్రసాద్, శ్రీను, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.