మహేష్ నిర్ణయం తో ఫ్యాన్స్ షాక్..

మే 31 వస్తుందంటే.. మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే కృష్ణ బర్త్ డే ఆరోజు. ప్రతి ఏడాది మే 31 న మహేష్ కొత్త సినిమా తాలూకా ఏదో ఒక అప్డేట్ వస్తుంటుంది. ఈసారి కూడా సర్కారు వారి పాట కు సంబదించిన అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్న వేళ..  మహేష్ టీం షాకింగ్ న్యూస్ చెప్పారు. మే 31 న ఏ అప్డేట్ రాదని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితుడైన బిఏ రాజు ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. మే 31న బిఏ రాజు పదకొండవ రోజు వేడుక. దీంతో “సర్కారు వారి పాట” సినిమా నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అప్డేట్ ఉండబోదని మహేష్ బాబు టీం ప్రకటించింది. మరి మిగతా సినిమాల అప్డేట్స్ కూడా ఉండనట్లే  ఇది మహేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.