ఏపీ శివయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పూతలపట్టు, ఐరాల మండలం, గుబలవారిపల్లిలో ఘనంగా కనుమ పండుగ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంత గ్రామస్తులు కార్యక్రమానికి విచ్చేసిన 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గుబలవారిపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల పంచాయతీ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కే.పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి వాసు, కార్యదర్శులు గూడేలు త్యాగరాజులు, చెల్లె రాజేష్, చక్రవర్తి మరియు గ్రామ పెద్దలు బాలకృష్ణ, చంద్రమణి, జయచంద్ర, మరియు మాజీ వార్డు సభ్యులు చంద్రమౌళి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జనసేన పార్టీ యువ నాయకులు ప్రకాష్, చెల్లె బాలాజీ, చెల్లి రాజా, దేవేంద్ర, ప్రసాద్ పాల్గొని విజయవంతం చేశారు.