జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు: తీగల చంద్రశేఖర్

ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించడం దేశానికి తీరని లోటని జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్నారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం బీపీన్ రావత్ చిత్రపటానికి జనసైనికులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నతమైన సీడీఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ త్రివిధ దళాలను సమన్వయపరచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. ప్రమాదంలో జనరల్ రావత్, ఆయన సతీమణి శ్రీమతి మధులికలతోపాటు మరో పదకొండు మంది రక్షణ దళాల అధికారులు ఈ దుర్ఘటనలో మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని, వీరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్, సుమన్, కోటి, శివ, సాయి, శంకర్, సంతోష్ తదితరులున్నారు.