కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సినిమాల షూటింగులకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు అనుమతిచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు జరుపుకోవచ్చని తెలిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో చిత్రీకరణలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు

బహిరంగ ప్రదేశాల్లో యూనిట్‌ సిబ్బంది మొత్తం ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఆరోగ్య సేతు యాప్‌ను నటీనటులంతా ఉపయోగించాలి.

షూటింగ్‌ సమయాల్లో విజిటర్లను అనుమతించవద్దు.

మేకప్‌ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.

సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి.

థియేటర్లలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి.

టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి.

షూటింగ్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి.

చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.