కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా.. రాష్ట్రపతి
కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టిన సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆయన ఓ సందేశాన్ని వినిపించారు. ప్రేమ, కరుణ, సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరినీ ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ‘ ‘ కొవిడ్-19 వల్ల 2020 సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. కరోనా మహమ్మారిని దూరం చేయడానికి మన మందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలి. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా” అని రాష్ట్రపతి అన్నారు.