పవన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు జనసేన ఫిర్యాదు

తుంగతుర్తి: తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులు మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులు మేకల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు తిరుమలగిరి నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో జనసేన పార్టీ తుంగతుర్తి నాయకులు. మహేష్ మీసాల, దుబ్బాక అశోక్ గౌడ్, శోబన్, శ్యామ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.