జనసైనికుడు కుటుంబానికి అండగా జనసేన
వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మోదుకూరు గ్రామ జనసైనికుడు నున్న వీరాస్వామి అనారోగ్యంతో ఆదివారం చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు చుండూరు మండల అధ్యక్షులు శ్రీరామమూర్తి, వేమూరు జనసేన నాయకులు పోకల శ్రీనివాసరావు, దేవిరెడ్డి మహేష్, కోడె భాస్కర్, జిల్లా కార్యదర్శి బోడియ్య, పోకల గోపి మరియు జనసైనికులు పరామర్శించి 13000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. జనసేన నాయకులు చవ్వాకుల కోటేష్ బాబు, ముత్తిరెడ్డి రవికృష్ణ, తన్నీరు నాగ వెంకటేశ్వరరావు, నున్న వీరయ్య గారికి నివాళులు అర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-8.04.55-PM-1024x462.jpeg)