జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్లను జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి, వందనాంబికలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనశ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.